బీఆర్కే భవన్ ను ముట్టడించిన నిరుద్యోగులు 

బీఆర్కే భవన్ ను ముట్టడించిన  నిరుద్యోగులు 

హైదరాబాద్: జీవో నెం. 330 ను యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సైఫాబాద్ లోని బీఆర్కే భవన్ ను టైపిస్టు నిరుద్యోగులు ముట్టడించారు. ప్ల కార్డులు చేతబూని...  జై టైపిస్ట్  నినాదాలతో టైపిస్ట్ నిరుద్యోగులు  బీఆర్కే భవన్ వద్ద నిరసనకు దిగారు. గ్రూప్ 3,  గ్రూప్ 4 లలో టైపిస్ట్ పోస్టులకు జీవో నెం.330 ప్రకారమే భర్తి చేయాలని వారు డిమాండ్ చేశారు. 2018 గ్రూప్ 4 నోటిఫికేషన్ లో టైపిస్టు పోస్టులు భర్తీ చేసిన విధంగానే వచ్చే నోటిఫికేషన్ లలో భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ఆందోళనను  ఉధృతం చేస్తామని హెచ్చరించారు.